ద్విపదభాగవతం - మధురకాండ : మగధేశుఁడు యాదవులపై దండెత్తుట
ననిపల్కి, యందంద ననిభేరి వ్రేయ
ఘనభాంకృతుల నబ్ధిగలఁగ సైనికుల
నీక్షించి మొనలేర్చి యిరువదినాల్గు
యక్షౌహిణులఁ గూడి యటవచ్చి మధుర
వెడలె మైముచ్చుట విడిసిన ప్రజను
వొడకుండ శ్రీకృష్ణుఁ డుగ్రసేనాదు
లగువారుఁ దానుఁ గార్యాలోచనంబుఁ
దగఁ జేయ వేగనందఱుఁ జూచుచుండ